Mahesh Babu – Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 2 టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు ఇదివరకు దర్శకులు తెలియజేశారు.
ఈ సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా పూర్తవ్వగానే రాజ మౌళి కొత్త ప్రాజెక్టును హీరో మహేష్ బాబు చేస్తారని తెలుస్తోంది ఇదే విషయమే ఎన్నోసార్లు రాజమౌళి ప్రస్తావించారు . ఒకవైపు రాజమౌళి త్రిబుల్ ఆర్,మహేష్ సర్కారీ వారి పాట సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్లో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో, రాజమౌళి సినిమా చేస్తారనీ తెలుస్తోంది.
కాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఖర్చు చేసే బడ్జెట్ గురించి తెలిస్తే KGF సినిమా వంటి బడా ప్రొడ్యూసర్ లైన ఆశ్చర్యపోవాల్సిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల రూపాయలతో నిర్మించడానికి నిర్మాత కె.ఎల్ నారాయణ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. మహేష్ బాబు సినిమా విషయంలో హాలీవుడ్ రేంజ్, టెక్నికల్ వాల్యూస్ తో కథను రూపొందించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఈ ఏడాది కాకుండా వచ్చే సంవత్సరం అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!