Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవలె `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించి.. మరో హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ అనంతరం మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఈ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అవ్వగా.. నందమూరి తారకరత్న విలన్గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. మరికొద్ది రోజుల్లోనే `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింట్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి మహేశ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`సర్కారు వారి పాట`కు రూ. 50 కోట్ల వరకు అందుకున్న మహేశ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మరింత పెంచేశాడట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. `ఎస్ఎస్ఎమ్బీ 28`కు గానూ రూ. 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ రూ. 50 కోట్ల వరకు డిమాండ్ చేశాడని.. వీరి రెమ్యునరేషన్స్తో సహా సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని టాక్ నడుస్తోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వాళ్లకే తెలియాలి. కాగా, త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా చిత్రాలు బాగానే అలరించడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మూవీతో మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!