Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు కూడా కడసారి చూడటం కోసం రావడం జరిగింది. సోమవారం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో కార్డియాక్ అరెస్ట్ తో జాయిన్ అవ్వగా.. మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో ముగ్గురు చనిపోవడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు కృష్ణ మరణ వార్తకి తలడిలిపోయారు.
ముఖ్యంగా మహేష్ బాబు తీవ్రంగా కుంగిపోయారు. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో ఇందిరా దేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో… కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉంటే మంగళవారం అభిమానుల సందర్శనార్థం కోసం గచ్చిబౌలి స్టేడియంలో… కృష్ణ భౌతికకాయాన్ని పెట్టాలని ముందుగా డిసైడ్ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల… మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన.. భౌతికకాయాన్ని గచ్చిబౌలికి తీసుకెళ్లలేకపోయారు. దీంతో చాలామంది ఫ్యాన్స్ అర్ధరాత్రి రోడ్లపై ఉండిపోవాల్సి వచ్చింది. అయిన గాని ఎలాగైనా తమ అభిమాన నటుడిని కటసారి చూడటానికి.. అలాగే ఉండిపోయారు. దీంతో అభిమానులు భోజనం చేయకుండా మంగళవారం నుండి రోడ్లపై ఉన్న విషయాన్ని తెలుసుకున్న మహేష్… వాళ్లకు ప్రత్యేకంగా అర్ధరాత్రి భోజనం పెట్టించడం జరిగిందట.
దీంతో ఇంత బాధలో కూడా తమ ఆకలి మహేష్ తీర్చడంతో…ఫ్యాన్స్ సంతోషించటం జరిగింది. ఇదే సమయంలో మహేష్ చాలా ధైర్యంగా.. ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బుధవారం జరిగిన అంత్యక్రియలు సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పద్మాలయ స్టూడియోలో ఉంచిన పార్థివ దేహాన్ని చూడటానికి.. అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఒకానొక టైంలో ఆపలేకపోయారు. దీంతో లాటిఛార్జ్ చేయాల్సి వచ్చింది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంచనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!