Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు రెండేళ్ల తర్వాత `సర్కారు వారి పాట` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో మంచి ఫామ్లోకి వచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కీర్తి సురేస్ హీరోయిన్గా నటించింది. సముద్రఖని విలన్గా చేయగా.. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
వేసవి కానుకగా మే 12న విడుదలైన ఈ చిత్రంపై మొదటి రోజు నెగటివ్ రివ్యూలు వచ్చినా.. ఆ తర్వాత గుడ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసింది. వరల్డ్ వైడ్గా రూ. 99.65 కోట్ల షేర్, రూ. 158.60 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు బ్రేక్ ఈవెన్గా దిశగా దూసుకుపోతోంది. అయితే మంచి విజయం సాధించడంతో.. శనివారం సోషల్ మీడియా సెలెబ్స్, యూట్యూబర్స్ తో సమావేశమయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు కాస్త సరదాగా, మరికాస్త ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి `సర్కారు వారి పాట` షూటింగ్ సమయంతో ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని అందరూ షేర్ చేసుకోవాలని మహేష్ బాబును కోరాడు.
అందుకు ఆయన బదులిస్తూ.. “ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. ఆ టైమ్లో కీర్తి చాలా ఇబ్బంది పడింది. అప్పుడు నేను `పర్వాలేదు కీర్తి.. నన్ను భయపడకుండా తిట్టు` అని చెప్పాను. దానికి ఆమె `సార్.. నేను అలా చేయలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.` అని చెప్పింది. `నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.` అని నచ్చజెప్పి చివరాఖరు ఆ సీన్ పూర్తి చేశాం. అయితే మొన్న ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్ చూసి సితార సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది. ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు.“ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో మహేష్ కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి.