Major: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా చేస్తూ మరో పక్క సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి మన సినిమాలలో నిర్మాణ భాగస్వామ్యం చూస్తూనే మరోపక్క.. కొత్త సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ రీతిగా అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని మహేష్ బాబు నిర్మించడం జరిగింది. ఈ సినిమా జూన్ 3వ తారీకు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. గతంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మహేష్ నిర్మాతగా చీఫ్ గెస్ట్ గా కూడా హాజరయ్యి … మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కూడా చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు మేజర్ టికెట్ల కోసం క్యూలో నిలబడి అనుకున్నట్లు వీడియో సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో హీరో అడివి శేష్ తో పాటు మహేష్ బాబు క్యూలో నిలబడతారు. ఇదే సమయంలో యూట్యూబర్ నిహారిక కూడా క్యూ లైన్ లో నిలబడటం జరుగుతుంది. ఈ క్రమంలో నిహారిక అదేవిధంగా హీరో అడవి శేషు మధ్య తోపులాట జరుగుద్ది. అయితే అదే లైన్ లో మహేష్ మధ్యలో రావడంతో నిహారిక మహేష్..పై గొడవ పెట్టుకోవాలి అనుకుంటుంది కానీ మహేష్ అందానికి స్టన్ అయిపొద్ది. ఆ తర్వాత లైన్ లో మహేష్ కి ప్లేస్ ఇస్తాది.
ఈ లోపు మహేష్ మాత్రమే కాక తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి మేజర్ టికెట్స్ కోసం లైన్ లో నించోబెడతరు. 2006వ సంవత్సరంలో ముంబై నగరంలో 26/11 జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో ఆర్మీ జవాన్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కించారు. ఇటీవలే కొంతమంది ఆర్మీ జవాన్లకు ఈ సినిమా స్పెషల్ షో పంజాబ్ లో వేశారు. సినిమా చూస్తున్న సమయంలో చాలా మంది ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రమే కాదు కొంత మంది మధ్యలో నిలబడి చప్పట్లు కొట్టారు. కచ్చితంగా “మేజర్” సూపర్ డూపర్ హిట్ అవుతుందని గతంలోనే మహేష్ చెప్పడం జరిగింది.