Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట”చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ ఇప్పటికే దుబాయ్ లో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.కొద్దిరోజుల క్రితమే రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభించిన ఈ సినిమా గురించి మహేష్ బాబు ఎప్పటికప్పుడు దుబాయ్ కి సంబంధించిన కొన్ని ప్రాంతాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ లో భాగంగా దుబాయ్ పోలీస్ స్టేషన్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
గురువారం దుబాయ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహేష్ బాబు లా మెర్ స్టేషన్ ఈ వాల్డ్లో ఫస్ట్ స్మార్ట్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ మనుషులతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు మాత్రమే సేవలు అందిస్తున్న విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన పోలీస్ స్టేషన్ తను గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇక్కడికి రావడం ఎంతో అద్భుతమైన విషయం అంటూ దుబాయ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
మహేష్ బాబు ఆ ఫోటోలను షేర్ చేసిన నమ్రత:
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రం ఒక రొమాంటిక్, యాక్షన్ తరహా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక బ్యాంకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా తీసుకొని కథను తెరకెక్కిస్తున్నారని సమాచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయలను దోచుకెళ్లిన బిజినెస్ మాన్ నుంచి మహేష్ బాబు డబ్బులు ఎలా రాబట్టాడు అనే కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్ తరహా సీన్లలో నటించడం కోసం ఫైట్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోను నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.