Mahesh Babu: నేడు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్తడే అమ్మ. నా జీవితంలో నువ్వు నాకు ఆశీర్వాదంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడు ప్రేమతో.. అని భావోద్వేగకరమైన కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబుకి తన తల్లి అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ముఖ్యంగా ఆమె చేసే కాఫీ అంటే చాలా ఇష్టమని కూడా మహేష్ ఇటీవల “ఆహా”లో బాలకృష్ణ యాంకర్ గా చేసిన “అన్ స్తాపబుల్” షోలో పాల్గొన్న మహేష్ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మహేష్ బాబు ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. మొన్ననే యాక్షన్ సన్నివేశాలలో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ షెడ్యూల్ లో పాల్గొన్న మహేష్ ప్రస్తుతం.. సినిమాలో మాస్ సాంగ్ కి స్టెప్ లు వేస్తున్నారు. శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ సాంగ్ కంపోజింగ్ జరుగుతోంది. “సరిలేరు నీకెవ్వరు” లో మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ కి థియేటర్ లో మహేష్ స్టెపు లకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే తరహా స్టెప్పులు …ఈ పాటకి శేఖర్ మాస్టర్ అందించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. మైండ్ బ్లాక్ లో లుంగీతో స్టెప్పులు వేయగా అదే తరహాలో “సర్కారు వారి పాట”లో జీన్స్ ప్యాంట్ కి కర్చీఫ్ కట్టి మహేష్ స్టెప్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జూన్ నెలలో మొదలు కానుందట. అప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి జనవరిలో సినిమా విడుదల చేసే ఆలోచనలో మహేష్ .. త్రివిక్రమ్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక జనవరి నుండి రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో మహేష్ పాల్గొంటారట. దాదాపు మహేష్ లైన్ అప్ చూస్తే అందరూ పెద్ద దర్శకులు కావటంతో.. రాబోయే ఈ మూడు ప్రాజెక్టు లపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి ప్రాజెక్టుపై అందరి దృష్టి ఉంది.