Mahesh Babu: హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ లో సూపర్ స్టార్ పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఘట్టమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులకు కూడా ఆహ్వానం పంపించడంతో భారీ ఎత్తున వచ్చారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ విందుకు సంబంధించి రెండు చోట్ల వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. 32 రకాల వంటకాలతో అభిమానులకు ప్రత్యేకమైన భోజనం మహేష్ తయారు చేయించారు.
దీంతో తమ అభిమాన నటుడు పెట్టిన స్పెషల్ భోజనాలకు అభిమానులు పొంగిపోతున్నారు. మహేష్ బాబుకి మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన తండ్రి తనకు చాలా ఇచ్చారు. వాటిలో అన్నిటికన్నా చాలా గొప్పది మీ అభిమానం. దానికి నేను ఎప్పుడు మా నాన్నగారికి రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడు మీ గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
మీ అభిమానం …ఆశీస్సులు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీరందరూ ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళాలి అని మహేష్ అద్భుతంగా తన తండ్రి చనిపోయాక అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మహేష్ స్పీచ్ కి ఆడిటోరియం మారుమొగింది. ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా మొదలు కానుంది.