Mahesh Rajamouli: భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” కి ఆస్కార్ అవార్డు రావడం ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం జక్కన్నతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని అంతర్జాతీయ అవార్డులు “RRR” అందుకోవటం జరిగింది. రాజమౌళి పేరు ప్రపంచ సినిమా రంగంలో మారుమొగుతుంది. ఇలాంటి తరుణంలో రాజమౌళి తర్వాత సినిమాపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంది.
దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ ని తాను తీసిన “బాహుబలి” కంటే మించే విధంగా తీయడానికి రెడీ అవుతున్నారు. విషయంలోకి వెళ్తే బాహుబలి రెండు భాగాలుగా రావడం తెలిసిందే. అయితే మహేష్ బాబుతో చేయబోయే సినిమా మూడు భాగాలుగా పాన్ వరల్డ్ సినిమాగా తీయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ నిర్మాతలు కూడా జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా స్టోరీ ఉండానున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నీ తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.
అనంతరం రాజమౌళి సినిమా మహేష్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా “SSMB29” ట్రయాలజీలో తెరకెక్కనుందని నెట్టింట క్రేజీ న్యూస్ చేక్కర్లు కొడుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారితోపాటు హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే 8 సంవత్సరాలలో మూడు భాగాలుగా “SSMB29” రిలీజ్ కానుందాన్ని సమాచారం.