SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విడుదలైన “సర్కారు వారి పాట” మొదటిరోజు హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ గ్లామర్… ఫైట్లు పాటలో డాన్సులు… చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హీరోయిన్ కీర్తిసురేష్ తో వచ్చే సన్నివేశాలు ఫస్టాఫ్ లో హైలెట్. టోటల్ గా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ నటించిన సినిమా విడుదలయి… బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూలు చేస్తున్న సినిమాగా “సర్కారు వారి పాట” నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో తాజాగా సినిమా సక్సెస్ కార్యక్రమాన్ని నిర్మాతలు కర్నూలులో నిర్వహించారు. ఊహించని రీతిలో ఈ సక్సెస్ ఈవెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు భయంకరంగా సభకు వచ్చారు.
అయితే స్టేజ్ పై కొన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. డాన్స్ వేయగా అదే సమయంలో… స్టేజ్ ముందు కూర్చున్న మహేష్ బాబు ఒక్కసారిగా ఎవరూ ఊహించని రీతిలో పాటలకు డ్యాన్స్ చేస్తున్న డాన్సర్ లతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో స్టెప్పులు వేసి కర్నూలు అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురి చేశాడు. సినిమాలు తప్ప ఇప్పటి వరకు మహేష్ తన సినిమా కార్యక్రమాలలో ఎక్కడ కూడా పబ్లిక్ గా స్టేజ్ డాన్స్ చేయలేదు. దీంతో మహేష్ స్టేజిపై డాన్స్ వేయడంతో సభ మొత్తం అరుపులతో కేకలతో నిండిపోయింది. చాలా ఎనర్జిటిక్ గా మహేష్ గ్రూప్ డాన్సర్ లతో స్టెప్పులు వేశాడు.