Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకు ఎవరు వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలు రావడంతో .. మహేష్ ఫ్యాన్స్ మొన్నటివరకు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించి కొంత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న ఒక అమ్మాయి విషయంలో ఫాన్స్ కి రాత్రి కూడా నిద్ర పట్టనంత భయం వేస్తున్నట్టు లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే ఆ అమ్మాయి మరెవరో కాదు హీరోయిన్ కీర్తి సురేష్.
“మహానటి” సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. తెలుగులో పెద్ద హీరోలతో నటించిన సినిమాలు చాలా వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నటించిన “అజ్ఞాతవాసి” సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా తరువాత సౌత్ ఇండియాలో అనేక సినిమాలు మరియు ఓటిటిలో కీర్తినటించిన సినిమాలు కూడా వరుసగా పరాజయాలు పాలు కావడంతో … కీర్తి సురేష్ గురించి మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారట.
తాజాగా నటించిన “గుడ్ లక్ సఖి” సినిమా కూడా నెగిటివ్ టాక్ సంపాదించడంతో… “సర్కారు వారి పాట” సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారట. మరోపక్క మహేష్ సినిమా మరో పోకిరి మాదిరిగా ఉంటుందని తెలపడంతో.. అభిమానులు సినిమా రిజల్ట్ విషయంలో తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. లేడీ ఓరియెంటెడ్ తరహాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర దారులుగా చేసిన “గుడ్ లక్ సఖి” అట్టర్ ఫ్లాప్ అవడంతో.. మహేష్ ఫ్యాన్స్ “సర్కార్ వారి పాట” సినిమా పరిస్థితి ఏంటో అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో గట్టిగా చేసుకుంటున్నారు.