SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” రేపే రిలీజ్. పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. “సర్కార్ వారి పాట”కి ముందు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మహేష్ సాధించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అని మహేష్ ఫిక్స్ అయిపోయారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా వరుసపెట్టి పాన్ ఇండియా లెవెల్ లో జక్కన్న రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో మహేష్ ప్రాజెక్టుపై ఇప్పుడు ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి తప్ప మహేష్ ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. కానీ ఫస్ట్ టైం “సర్కారు వారి పాట” ప్రమోషన్ కార్యక్రమాల్లో.. రాజమౌళి సినిమా గురించి కొత్త విషయాలు తెలియజేశారు. రాజమౌళితో చేస్తున్న ఒక్క సినిమా.. 25 సినిమాలకు సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఆలస్యంగా విడుదల అయినప్పటికీ కచ్చితంగా ..నా అభిమానులు.. రాజమౌళి ప్రాజెక్టు విషయంలో చాలా హ్యాపీగా ఉంటారని మహేష్ ధీమా వ్యక్తం చేశారు.
మహేష్ కామెంట్లతోస్ట్రాంగ్ స్టోరీతో మహేష్ ని.. రాజమౌళి చూపిస్తున్నట్లు తెలుస్తుందని.. తాజా వార్తపై అభిమానులతో పాటు సినీ లవర్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే జూన్ నెల నుండి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొనబోతున్నారు. ఈ సినిమా షూటింగ్.. ఏకధాటిగా ఈ ఏడాది చివరి వరకు జరగనుందట. ఆ తరువాత వచ్చే ఏడాది నుండి రాజమౌళి సినిమా పై మహేష్ ప్రత్యేకమైన దృష్టి పెట్టనున్నట్లు.. అందుతున్న సమాచారం.