సూపర్ స్టార్ మహేష్తో `భరత్ అనే నేను` సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది కియరా అద్వాని. తర్వాత రామ్చరణ్తో `వినయవిధేయరామ` చిత్రంలోనూ నటించింది. హిందీలో ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్లో హీరోయిన్గా నటించింది. అలాగే కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్లో హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పుడు ఓ బోల్డ్ మూవీలో కియరా అద్వాని నటించనుందట. ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు. ఆ సినిమా పేరు `ఇందు కీ జవానీ`. ఈ చిత్రంలో డేటింగ్ యాప్ చూసి కుర్రాళ్లను ప్రేమించే యువతి పాత్రలో కియరా కనిపించనుంది. అంటే పాత్ర పరంగా ఘాటైన రొమాన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కియరా అద్వాని చేస్తున్న ఓ బోల్డ్ అటెంప్ట్ అనుకోవచ్చుగా.
previous post
next post