Sarkaru Vaari Paata: “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ దాదాపు ఏడాదిన్నరకు పైగానే జరుపుకుంటూ ఉంది. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో మంచి స్పీడ్ మీద ఉన్న మహేష్ కి మహమ్మారి కరోనా రాకతో దాదాపు రెండు సంవత్సరాల టైం వేస్ట్ అయ్యింది. “సర్కారు వారి పాట” సినిమా “పోకిరి” తరహాలో ఉంటుందని మహేష్ తెలియజేయడంతో ఈ సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
కరోనా స్టార్టింగ్ తర్వాత సెకండ్ వేవ్ మళ్లీ ఇటీవల ఒమికృన్ రాకతో షూటింగ్కు అంతరాయం కలగడంతో.. ప్రస్తుతం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి మహేష్ రంగంలోకి దిగారు. విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి ఇప్పటికే యాక్షన్ సన్నివేశాలకు హాలీవుడ్ ప్రొఫెషనల్ ఫైటర్ల ను రంగంలోకి దింపడం జరిగింది అని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాకుండా గతంలో దుబాయ్, గోవా, స్పెయిన్ వంటి చోట్ల భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో.. సినిమాకి హైలెట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఈరోజు సినిమా యూనిట్ రెడీ అవటం జరిగిందట. ఈ ఒక్క యాక్షన్ సన్నివేశం తో “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుందని.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. విలన్ పాత్రలో సముద్రకని నటిస్తున్నారు. కాగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన కళావతి సాంగ్ మంచి మెలోడీ కావడంతోపాటు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తున్నాయి. వేసవి కానుకగా మే 12వ తారీకు రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.