Aacharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “భరత్ అనే నేను” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా చాలా టైమ్ తీసుకుని కొరటాల డైరెక్షన్ చేస్తూ ఉండటంతో ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కావటంతో సంగీతం పరంగా కూడా అంచనాలు మరింతగా ఉన్నాయి. గతంలో మెగాస్టార్ – మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక మ్యూజికల్ రికార్డులు సృష్టించడంతో “ఆచార్య” ఖచ్చితంగా మ్యూజికల్ భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నారు.
దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ మణి శర్మ చిరంజీవి సినిమా కి బాణీలు అందిస్తూ ఉండటంతో సరికొత్త పాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఆధ్యాత్మిక తరహాలో ఓ సాంగ్ ఉంటుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “ఖలేజా” సినిమాలో “సదాశివా సన్యాసి” అనే పాట తరహాలో ఆచార్య లో డివైన్ సాంగ్ మణి శర్మ కంపోజ్ చేయడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఖచ్చితంగా ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని లేటెస్ట్ టాక్. అప్పట్లో ఖలేజా సినిమాలో “సదాశివా సన్యాసి” సాంగ్ ఎంతగానో హిట్ అయింది. అన్ని పాటల్లో కల్లా ఈ సాంగ్ కి మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి రావడం జరిగింది. సినిమా పెద్దగా ఆడకపోయినా గాని ఈ సాంగ్ మాత్రం సినిమాకి హైలైట్ అయింది. దీంతో ఇప్పుడు అదే తరహాలో చిరంజీవి “ఆచార్య”కి మణిశర్మ కంపోజ్ చేస్తున్నట్టు వార్త రావడంతో ..ఎటువంటి టైపులో మ్యూజిక్ ఉంటుందో అని తెగ ఆత్రుత గా ఉన్నారు మెగా అభిమానులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?