ఏడాదిగా ప్రపంచాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్న కరోనా మహమ్మారి.. ఇక శాంతించింది అనుకునే లోపు మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అనే మాటల దగ్గర నుంచి ఏకంగా బ్రిటన్ లో ‘స్ట్రెయిన్’ అనే కొత్త టర్న్ తీసుకుని బెంబేలెత్తించేస్తోంది. దాదాపు ప్రపంచంలో మళ్లీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ పరిస్థితులు వచ్చేస్తున్నాయనే ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తోందని చెప్పాలి. ఇప్పుడిప్పుడే రెగ్యులర్ షూటింగ్స్ కు ప్రిపేర్ అవుతున్న సినిమాలపై ఈ ప్రభావం పడుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట యూఎస్ షెడ్యూల్ వాయిదా పడుతోందనే వార్తలు వస్తున్నాయి.
ఇటివలే సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభిస్తారనే వార్తలు వచ్చాయి. అమెరికాలోని చికాగోలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రయాణాలపై బ్రిటన్ ‘స్ట్రెయిన్’ ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్ ఇదే ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో విదేశాల్లో షూటింగ్ కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి తర్వాతే షూటింగ్ కు వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గాసిప్ గా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న అనేక సినిమాలు ఇప్పుడు ఇదే డైలమాలో పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో అల్లు అర్జున్ పుష్ప మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. పూరి-విజయ్ ఫైటర్ ఇప్పటికీ మొదలు కాకపోయినా మరికొన్నాళ్లు వెయిట్ చేస్తారని అంటున్నారు. మరి విదేశాల్లో షూటింగ్ అంటే ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరిగే షూటింగ్స్ పై కూడా ఈ ప్రభావం పడుతుందేమో చూడాలి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమ, ధియేటర్లకు పర్మిషన్.. వంటి అంశాలపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందేమో చూడాల్సిందే.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!