Mahesh NTR: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ అనేక రంగాలనీ తలకిందులు చేయటం తెలిసిందే. అయితే ఈ మహామారి కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాలలో సినిమా రంగం ఒకటి. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు వలన షూటింగ్ లో ఆగిపోవటం మాత్రమే కాదు థియేటర్ లపై ఆంక్షలు విధించడంతో నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడు కేసులు పెరుగుతాయో తెలియదు.. ఎప్పుడు థియేటర్ లపై ప్రభుత్వం ఆంక్షలు పెడతారో అర్థం కాని పరిస్థితి.
ఈ రకంగా రెండు సంవత్సరాల పాటు భారతదేశ చలనచిత్ర రంగం అనేక ఇబ్బందులు ఎదురు కావడం జరిగింది. మొన్న మార్చి నుండి పరిస్థితుల్లో అతను అనడంతో రెండు సంవత్సరాల నుండి లైన్ లో ఉన్న సినిమాలు.. వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో ఫోర్త్ వేవ్ జూన్ మాసంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మహేష్ మరియు ఎన్టీఆర్ షుటింగ్ ల విషయంలో ముందు జాగ్రత్త పడినట్లు సమాచారం.
మేటర్ లోకి వెళ్తే “ఆర్ఆర్ఆర్” తర్వాత తారక్ కొరటాల ప్రాజెక్ట్ ఓకే చేయటం తెలిసిందే. ఇక ఇదే సమయంలో మహేష్ బాబు “సర్కారు వారి పాట” త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగులు వాస్తవానికి ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూన్ నెలలో దేశంలో మళ్ళీ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో… షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి అంతరాయం కలగకుండా.. నిర్మాతలకు నష్టం రాకూడదని జూన్ మాసంలో తదుపరి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలని మహేష్ తారీఖు డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.