Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఇటీవల వరుసగా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమా తో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న మహేష్ ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొన్నటి వరకు చాలా శరవేగంగా సాగింది. మొదటి షెడ్యూల్ దుబాయిలో విజయవంతంగా పూర్తిచేసుకుని ఇటీవల హైదరాబాదులో రెండో షెడ్యూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే సినిమాల పరంగా సక్సెస్ అవుతూ కెరీర్ సాగిస్తున్న మహేష్ తన వంతుగా సమాజంలో అనేక మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అనేక ప్రముఖ కంపెనీల యాడ్స్ చేస్తూ అంబాసిడర్ గా ఉంటూ వాటికి వచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువగా .. సమాజంలో అనేక అవసరాలను తీర్చే రీతిలో ఖర్చు పెడుతూ ఉంటారు. చిన్న పిల్లలకు సంబంధించి గుండె ఆపరేషన్లు గాని ఇంకా చాలా కార్యక్రమాలు ఉచితంగా మహేష్ అండర్ టీం చేస్తూ ఉంటది. ఈ కార్యక్రమాలన్నీ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఆధ్వర్యంలో జరుగుతాయని చాలామంది ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దీనిలో భాగంగానే గతంలో మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమా వచ్చిన సమయంలో.. తన తండ్రి జన్మించిన బుర్రిపాలెం అదేవిధంగా సిద్దాపురం అనే గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది.
అక్కడ గ్రామ ప్రజలకు సరైన వైద్యం విద్యతోపాటు రోడ్లు వేయించారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా అనే భయంకర వ్యాధి వల్ల జనాలు చనిపోతున్నా తరుణంలో తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం అదేవిధంగా సిద్దాపురం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడానికి మహేష్ బాబు డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త వినబడుతోంది. రెండు గ్రామాలకు చెందిన ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని .. మహేష్ అండ్ టీం ఆలోచన చేసినట్లు దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద పర్మిషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో రియల్ హీరో మహేష్ బాబు నిజం గా శ్రీమంతుడు అంటూ తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు.