SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది. ఇలా ఉంటే మహేష్ ప్రతి ఏడాది తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీకు తన కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వటం సెంటిమెంట్ అని అందరికీ తెలుసు.
అయితే ఈ ఏడాది కృష్ణ మరణించడం కావటంతో… కృష్ణ చనిపోయాక వస్తున్న మొదటి జయంతి కావటంతో.. అభిమానులను అలరించడానికి భారీ ఎత్తున మహేష్ “SSMB28″కి సంబంధించి అప్ డేట్ ప్లాన్ చేయటం జరిగిందట. దీంతో ఫస్ట్ గ్లింప్స్ వీడియోతో పాటు టైటిల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. చాలా వరకు “గుంటూరు కారం” అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇందుట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. మే 31వ తారీకు కృష్ణ జయంతి సందర్భంగా సూపర్ స్టార్ మాస్ ధమాకా ఇవ్వబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వస్తున్నాయి మూడో చిత్రం “SSMB28” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతడులో మహేష్ బాబుని చాలా సీరియస్ గా చూపించడం జరిగింది. ఖాలేజా లో… అతడు సినిమాకి భిన్నంగా మహేష్ లో కొత్త కామెడీ హ్యూమర్ నీ త్రివిక్రమ్ పరిచయం చేయించాడు. దీంతో ఈ సినిమాలో మహేష్ బాబుని ఏ రకంగా చూపిస్తాడు అన్నది అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇప్పటివరకు విడుదలైన కొత్త పోస్టర్స్ లో మహేష్ చాలా కాలం తర్వాత సిగరెట్టు వెలిగించటం సంచలనంగా మారింది.