Mahesh Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు అర్ధాంగి గురించి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది. సినిమాలో మహేష్ రానిస్తుంటే మరోపక్క మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మహేష్ సొంత నిర్మాణ సంస్థకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటూ వస్తున్నారు. కాగా నమ్రత సినిమాలోకి రాకముందు..మోడలింగ్ చేశారు. మిస్ ఇండియాగా కూడా నిలిచారు. ఆ తర్వాత మూవీస్ చేయడం జరిగింది.
స్టార్టింగ్ లో బాలీవుడ్ లో రాణించారు. ఆ తర్వాత సౌత్ లో అవకాశాలు అందుకోవటం జరిగింది. తెలుగులో చిరంజీవి తో కలిసి నటించిన నమ్రత…మహేష్ బాబుతో “వంశీ” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అప్పటినుండి సినిమా ఇండస్ట్రీకి నమ్రత దూరమయ్యారు. మహేష్ బాబుతో మూడు ముళ్ళు పడిన తర్వాత పూర్తిగా కుటుంబానికి పరిమితమయ్యారు. ఇక ఇదే సమయంలో మహేష్ సినిమాలకు సంబంధించి ఇంకా పిల్లల విషయాలు అన్నీ దగ్గరుండి చూసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా కెమెరా ముందుకొచ్చి నటించిన దాఖలాలు లేవు. అడపాదనప కొన్ని యాడ్స్ అది కూడా మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. పెళ్లయిన తర్వాత సినిమాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో.. నమ్రత తెలియజేశారు. మహేష్ పెళ్ళికి ముందు సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టడం జరిగింది. సినిమాలు మాత్రమే కాదు ఏ పని చేయవద్దని.. మహేష్ ముందే చెప్పాడు. ఓ ఆఫీసులో వర్క్ చేస్తే అది కూడా వదిలేయమని చెప్పాడు. వర్కింగ్ వైఫ్ అతడికి ఇష్టం లేదు..అని అన్నారు. యాక్టింగ్ నుంచి తప్పకుండా అందుకు కూడా ఇలాంటి బాగాలేదని నమ్రత చెప్పుకొచ్చింది.