SVP Trailer: “సర్కారు వారి పాట” ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. క్లాస్.. మాస్ టచ్ ఇచ్చుకుని డైరెక్టర్ పరుశురాం చాలా స్టైలిష్ గా మహేష్ బాబుని చూపించాడు. బ్యాంకు నేపద్యంలో సాగే కథ అని ట్రైలర్ బట్టి మరోసారి అర్థమవుతోంది. ఇదే తరుణంలో కాస్త “దూకుడు” ఫ్లవర్ కూడా కనిపిస్తోంది. మహేష్ పక్కన వెన్నెల కిషోర్ ఉన్న.. సన్నివేశాలు దాదాపు ఆ తరహాలోనే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రైలర్ లో మహేష్ బాబు.. 2019 ఎన్నికల సమయంలో జగన్ నినాదం “నేను విన్నాను నేను ఉన్నాను” అన్న డైలాగ్.. నీ చెప్పడం జరిగింది. కీర్తి సురేష్ కి భరోసా ఇస్తూ.. “నేను విన్నాను నేను ఉన్నాను” అని డైలాగ్ చెప్పాడు. ఈ నినాదంతో వైయస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తించారు. తిరుగులేని విజయాన్ని సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం తెలిసిందే. కృష్ణ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీకి మొదటినుండి మంచి సంబంధాలు ఉన్నాయి.
2019 ఎన్నికల సమయంలో కూడా మహేష్ ఫ్యాన్స్ వైఎస్ జగన్ కి మద్దతు తెలిపేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇక ఇదే సమయంలో టికెట్ ధరల విషయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను మహేష్ పొగడటం కూడా మనం చూశాం. మరి ఇటువంటి తరుణంలో ఏకంగా ఇప్పుడు తన సినిమా “సర్కారు వారి పాట” ట్రైలర్ లో మహేష్ .. జగన్ నినాదం చెప్పటం అటు రాజకీయలలో ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా సంచలనం రేపింది. వేసవి సందర్భంగా మే 12వ తారీకు “సర్కారు వారి పాట” రిలీజ్ కానుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!