SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ “సర్కారు వారి పాట”. “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వేసవి సందర్భంగా మే 12వ తారీకు విడుదల అవటానికి సిద్ధం అయింది. ఈ సినిమాకి ముందు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ మహేష్ అందుకున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఈ మూడు సినిమాలతో అభిమానులను ఎంతగానో అలరించాడు. అయితే “సర్కారు వారి పాట” తన కెరీర్ లో మరో “పోకిరి” అవుతుందని తెలపడంతో.. అభిమానులకి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో తమన్ అందించిన మ్యూజిక్ … సాంగ్స్ కి బాగా రెస్పాన్స్ రావటం ఇటీవల మనం చూశాం. కళావతి, పెన్నీ, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఈ నెల 27వ తారీకు రిలీజ్ అవుతున్నట్లు ఇటీవల ఓ వార్త వైరల్ అయింది. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బెస్ట్ ఎవర్ ట్రైలర్ స్కోర్ రేపు మొదలు పెట్టనున్నట్లు తెలుపుతూ డైరెక్టర్ పరుశురాం మరియు మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపించాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఫిలిం వర్గాల లో అందుతున్న సమాచారం ప్రకారం మే ఒకటో తారీకు “సర్కారు వారి పాట” ట్రైలర్ రిలీజ్ అవుతున్నట్లు లేటెస్ట్ కొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం ఇటీవలే మహేష్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి మాస్ లుక్ లో మహేష్ కనిపిస్తున్నారు. బ్యాంక్ నేపథ్యంలో డబ్బులు రికవరీ చేసే క్యారెక్టర్లో మహేష్ నటిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు మే ఒకటవతారీకు ట్రైలర్.. రిలీజ్ అని కొత్త వార్త రావడంతో ఆ రోజు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలి అని మహేష్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.