ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్న మహేష్ బాబు తదుపరి అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నిజానికి సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కథ నచ్చలేదని మహేష్ పక్కన పెట్టేశాడు. దీంతో సుకుమార్ అదే కథను అల్లు అర్జున్ చేయడానికి రెడీ అయిపోయి.. అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. దీనిపై మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సుకుమార్తో తాను సినిమా చేయడం లేదని ప్రకటించాడు. “క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్తో సినిమా చేయడం లేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి నా శుభాకాంక్షలు. ఓ ఫిలింమేకర్గా ఆయనంటే నాకు ఎప్పటికీ గౌరవమే. ఆయనతో నేనొక్కడినే వంటి కల్ట్ క్లాసిక్కు పనిచేసిన విషయం నాకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆయనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను“ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అయితే మహేష్ లాంటి స్టార్ అలాంటి స్టేట్మెంట్ను ఎందుకివ్వాలని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. సుకుమార్ ఉన్నట్టుండి బన్నితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో మహేష్ కాస్త కినుక వహించాడు. కాబట్టే అసహనంతోనే అలాంటి మెసేజ్ పోస్ట్ చేశాడని వార్తలు వినపడుతున్నాయి.
previous post