Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న హీరో మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఈ మూడు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఇలా ఉంటే త్వరలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
గతంలో మహేష్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా… మహేష్ లో ఉన్న సరికొత్త యాక్టర్ నీ బయటపెట్టి ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. అయితే ఈసారి సరికొత్త ఫార్ములాతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు మరింత కామెడీ హ్యూమర్ సినిమాలో ఉండేలా.. త్రివిక్రమ్ సరికొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సర్కారు వారి పాట సినిమా అయిన వెంటనే… త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కెరీర్లో 30 ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది కానీ ఇంతలోనే.. ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో.. రావటం తో త్రివిక్రమ్ మహేష్ తో.. మూడో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు అభిమానులను మాత్రమే కాక సినిమా ప్రేమికులను కూడా ఎంతగానో ఆదరించడం జరిగింది. దీంతో తాజాగా హ్యాట్రిక్ కి ఇద్దరు రెడీ అవడంతో ఈ మూడో సినిమా ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.