Mahesh – Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఇటీవల నిర్మాణ రంగంలోకి దిగారు. తన భార్య సాయి సౌజన్యను సహ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిపారు. నవీన్ పొలిశెట్టితో నిర్మించనున్న సినిమాకు త్రివిక్రమ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి – నిత్యా మీనన్ – సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాతో బిజీగా ఉండటంతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన చేయాల్సిన సినిమా డిలే అవుతోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. గీత గోవిందం లాంటి క్లాస్ హిట్ తర్వాత మహేశ్తో దర్శకుడు పరశురామ్ పక్కా మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా చేయాల్సింది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అవడం వల్ల మహేశ్ – రాజమౌళి సినిమా డిలే అయింది. దాంతో మహేశ్ ఈ గ్యాప్ను మరో సినిమాతో ఫిల్ అప్ చేయాలనుకున్నాడు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్తో హ్యాట్రిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Mahesh – Trivikram: కొత్త ప్రాజెక్ట్కు థమన్ ఫిక్స్ ..!
కోవిడ్ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ఉంటుందా ఉండదా అంటూ రూమర్స్ వచ్చి వైరల్ అయ్యాయి. దానికి తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒకే చోట కలిసి ప్రాజెక్ట్ ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. దీనికి థమన్ సంగీత దర్శకుడని తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. సితార సంస్థలో నిర్మిస్తున్న సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అలవైకుంఠపురములో అంతకముందు అరవింద సమేత సినిమాలకు థమన్ సంగీతం అందించాడు. ఇప్పుడు మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాటకు థమన్ సంగీత దర్శకుడు. ఇలా కామన్గా థమన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్కు థమన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.