SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ దసరా ముందే కంప్లీట్ అయింది. నవంబర్ నెలలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సినిమా యూనిట్ తెలియజేసింది. అయితే ఇప్పుడు నవంబర్ లో జరగబోయే సెకండ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ అని అందరికీ తెలుసు. ఆమె ఇటీవల సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలలో పాల్గొని గాయాలు పాలయ్యింది.
ఆమె ఎడమకాలు లెగ్మెంట్ దగ్గర ఫ్రాక్చర్ కావడంతో ఆమె రెస్ట్ లో ఉంది. పూజా హెగ్డే కాలికైన గాయం టైం పట్టే అవకాశం ఉండటంతో సెకండ్ షెడ్యూల్ ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ షెడ్యూల్ లోనే హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ కానున్నట్లు సినిమా యూనిట్ అంతకుముందు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఇంతలోనే ఆమెకు గాయం కావడంతో.. నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఈ పరిణామంతో మహేష్ అభిమానులు తల పట్టుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నుండి అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి జూన్ నెలలో మొదలు కావలసిన సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో స్టార్ట్ అయ్యింది. అయితే ఇంతలోనే మహేష్ తల్లి మరణించడం.. జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడం పట్ల.. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా అనే డౌటులో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ 28వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో సెకండ్ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న సమయంలో హీరోయిన్ కాలికి గాయం కావడంతో .. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్ – మహేష్ మూడో ప్రాజెక్ట్ ప్రకటన నాటి నుండి అనేక అడ్డంకులు రావటం…సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు పూజా హెగ్డేకి గాయం కావడంతో దెబ్బ మీద దెబ్బ.. అంటూ అభిమానులు బాధపడుతున్నారు.