టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ తిరుగులేని కాంబినేషన్. సినిమాలో మహేష్ ని చాలా ప్రొఫెషనల్ కిల్లర్ గా మాత్రమే కాకుండా చాలా హాలీవుడ్ హీరో స్టైల్ లో చూపించి ప్రేక్షకులను మెప్పించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ఖలేజా మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని బయట పెట్టాడు. “ఖలేజా” సినిమా రాకముందు వరకు మహేష్ కి కామెడీ చేయడం రాదనే టాక్ ఉండేది. కానీ “ఖలేజా” లో మహేష్ లో ఉన్న పంచ్ జోనర్ నీ త్రివిక్రమ్ బయటపెట్టి సరికొత్త నటుడిని ఇండస్ట్రీకి చూపించాడు.
ఆ తర్వాత మహేష్ నటించిన సినిమాల కథలు కూడా కామెడీ తరహాలో వచ్చి భారీ స్థాయిలో విజయాలు సాధించాయి. ఇదిలా ఉండగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుందని చాలా కాలం నుండి అభిమానులు ఎదురు చూశారు. కానీ కుదరలేదు. కాగా ఇటీవల “ఖలేజా” సినిమా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అయిన నేపథ్యంలో… ట్విట్టర్లో మహేష్ సంచలన కామెంట్ పెట్టారు. త్వరలోనే త్రివిక్రమ్ తో మరో సినిమా ఉంటుందని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటించాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరోపక్క మహేష్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాకముందే త్రివిక్రమ్ తో సినిమా అని మహేష్ ప్రకటించడంతో త్రివిక్రమ్ కి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయిందట. ప్రస్తుతం ఎన్టీఆర్ “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మా మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందట. ఇటువంటి తరుణంలో త్రివిక్రమ్ మహేష్ తో ముందు చేస్తాడో లేకపోతే ఎన్టీఆర్ తో చేస్తాడా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.