ఆదివారం(జూలై 14)రోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. రెండు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. థ్రిల్లింగ్ పోరులో నియమ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే న్యూజిలాండ్ పోరాట పటిమను అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. అందరి హృదయాలను కివీస్ జట్టే గెలుచుకుందని అంటున్నారు. ఈ వరుసలో సూపర్స్టార్ మహేశ్ కూడా చేరారు. ఇంగ్లాండ్, కివీస్ జట్ల ఫోటోలను షేర్ చేసిన మహేశ్ “ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇంత ఎగ్జయిటింగ్ మ్యాచ్ చూడలేదు. గ్రేట్ క్రికెట్.. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల హృదయాలను మాత్రం కివీస్ జట్టే గెలుచుకుంది. రెండు టీమ్స్కు అభినందనలు“ అన్నారు.