ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసిన డైరెక్టర్ మెహర్ రమేశ్కి అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ చిత్రాలుగా నిలవడంతో అవకాశాలు రాలేదు. అయితే తర్వాత ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన మహేశ్కు అన్ ఆఫీషియల్ పి.ఆర్గా వ్యవహరిస్తున్నాడు. నమ్రతకు తోడుగా ఉంటూ అన్ని వ్యవహారాల్లో సహకారం అందిస్తున్నాడు. రీసెంట్గా మెహర్ రమేశ్కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అదేంటంటే.. శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేశ్ తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను అంద చేస్తున్నాడు. ఈ విషయంపై రీసెంట్గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సతీమణి వై.ఎస్.భారతిని నమ్రత కలిసింది. ఆ క్రమంలో వై.ఎస్.జగన్ నివాసంలోకి వెళుతున్నప్పుడు నమ్రతను లోపలికి అనుమతించిన సెక్యూరిటీ లిస్టులో పేరు లేదనే కారణంగా మెహర్ రమేశ్ను అనుమతించలేదట. ఈ వ్యవహారంపై మెహర్ రమేశ్ అసహనం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాడని సమాచారం.
previous post
next post