సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు. ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ విషయంలో కూడా అలాంటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అనే సందేహం నెలకొంది. అదేంటంటే.. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీని నటింప చేయడం. స్పైడర్ సమయంలో దర్శక నిర్మాతలు పరిణీతి చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. ఆమె మూడు కోట్లు డిమాండ్ చేయడం డ్రాప్ అయ్యారు. ఆ స్థానంలో రకుల్ నటించింది. సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక భరత్ అనే నేను సినిమా విషయానికి వస్తే… ఇందులో బాలీవుడ్ భామ కైరా అద్వాని నటించింది. సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇప్పుడు మహేష్ 25వ చిత్రం `మహర్షి` విషయానికి వస్తే.. ఇందులో పూజా హెగ్డే నటిస్తుంది. ఈమె ఒక బాలీవుడ్ సినిమాలోనే నటించింది.మరి ఈ సినిమా ఫలితం ఇప్పుడే చెప్పలేం. అలాగే మహేష్ 26వ చిత్రం అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్గా అనుకుంటున్నారు. అయితే తాజాగా హీరోయిన్ రేసులో సోనాక్షి సిన్హా పేరు పరిశీలనలోకి వచ్చింది. గతంలో రజనీకాంత్తో లింగ చిత్రంలో నటించిన సోనాక్షి మరే దక్షిణాది చిత్రంలో నటించలేదు. ఇప్పుడు సోనాక్షిని నటింప చేస్తే మార్కెట్ పరంగా కూడా కాస్త బెటర్మెంట్ ఉంటుంది. స్పాన్ పెరుగుతుంది కదా.. నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఒకవేళ అదే నిజమైతే.. సోనాక్షి ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.
previous post
next post