దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని `యాత్ర` సినిమా చేసిన దర్శకుడు మహి.వి.రాఘవ్.. వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సినిమా మేకింగ్ పరంగా `యాత్ర` చిత్రంతో మహి వి.రాఘవ్కి మంచి ప్రశంసలే దక్కాయి. `యాత్ర` సినిమాలో వై.ఎస్.ఆర్ పాత్రను మమ్ముట్టితో చేయించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ యువ దర్శకుడు ఇప్పుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్తో తెలుగులో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇటీవల దుల్కర్ను కలసి టూకీగా కథ చెప్పాడట. ఐడియా నచ్చడంతో దుల్కర్ సినిమా చేయడానికి ఓకే అన్నాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ఇప్పుడు మహి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే బిజీగా ఉన్నాట్ట. కాగా.. `మహానటి` సినిమా తర్వాత దుల్కర్ చేసే స్ట్రయిట్ మూవీ ఇదే కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత పివిపి నిర్మిస్తాడని సమాచారం.
previous post