Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓమ్ రౌత్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న హిందీ స్ట్రైట్ మూవీ ‘ఆదిపురుష్’. ఇప్పటికే ప్రభాస్తో పాటు మిగతా నటీ నటులందరూ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 11న పాన్ వరల్డ్ సినిమాగా అత్యంత భారీ స్థాయిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. ఇక ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తై కూడా చాలా రోజులు అవుతోంది.
కాబట్టి ఈ సినిమా రిలీజ్ గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాను ఏకంగా 500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ 500 కోట్ల బడ్జెట్లో దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు గ్రాఫిక్స్ కోసమే కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆదిపురుష్ మూవీ మేకర్స్ అధికారికంగా ఓ క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ మూవీ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ భారీ బడ్జెట్లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
Adipurush: ఇండియాలోనే అతిపెద్ద మోషన్ గ్రాఫిక్స్ చిత్రంగా..!
కాగా, ఇండియాలోనే అతిపెద్ద మోషన్ గ్రాఫిక్స్ చిత్రంగా ఆదిపురుష్ సినిమా నిలువబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాను ఏప్రిల్ మొదటి వారం లేదా రెండవ వారలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఓ డేట్ను పరిశీలిస్తున్నారు. అలాగే, యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇక ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె కూడా సెట్స్ మీద ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?