Manchu Lakshmi: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” భారతీయ చలనచిత్ర రంగంలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక అదేరీతిలో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. “బాహుబలి” క్రియేట్ చేసిన రికార్డులతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రపై మంచు లక్ష్మి రీసెంట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వాస్తవానికి రమ్యకృష్ణ కంటే ముందు శివకామి పాత్రకి మంచు లక్ష్మిని దర్శకుడు రాజమౌళి సంప్రదించడం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి అనేక ఇంటర్వ్యూలలో తెలియజేసింది. ప్రభాస్ తల్లిగా నటించడం అసంభవం.. శివగామి పాత్రను వదులుకున్నట్లు అనేకసార్లు తెలిపారు. ఇక రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో “బాహుబలి”లో తాను శివగామి పాత్ర చేయనందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పాత్ర చేస్తే అదే తరహా పాత్రలు వస్తూ ఉంటాయి.
దీంతో అలాగే ఉండిపోతాం. కానీ నేను అలా కాదు. ఒకే తరహా పాత్రలు చేయడం నావల్ల కాదు. బాహుబలి అతి పెద్ద విజయం సాధించటంతో చాలా గర్వపడ్డాను. హమ్మయ్య నేను ఆ శివగామి పాత్ర చేయలేదు అని అనుకున్నాను. అది ప్రత్యేకమైన సినిమా కావచ్చు కానీ నా కెరియర్ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇక నా కెరియర్లో అనగనగా ఓ ధీరుడు లో చేసిన ఐరెంద్రి పాత్ర నాకు చాలా స్పెషల్ అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.