టాలీవుడ్ పెదరాయుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు లక్ష్మీ మంచు సర్ ప్రైజ్ ఇచ్చారు. తరచూ షూటింగ్ లలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ కుటుంబ సభ్యులు ఉపశమనం పొందడానికి మాల్దీవుల వెకేషన్ కు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. వీరి మాల్దీవుల వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు లక్ష్మీ ప్రసన్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే మంచు లక్ష్మీ ప్రసన్న మాల్దీవులలో తన తండ్రికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.
మాల్దీవులలో గత రాత్రి.. సాగర తీరాన విందు ఏర్పాటు చేసే మోహన్ బాబుకు సర్ప్రైస్ ఇచ్చారు.అంతే కాకుండా మోహన్ బాబు నటించిన సినిమాలలో పాటలను వింటూ సాగరతీరాన ఇష్టమైన భోజనం చేస్తూ వ్యక్తిగతంగా మా కోసం కొంత సమయాన్ని గడిపి చాలా రోజులు కావడంతో వ్యక్తిగతంగా ఈ క్షణాలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయని ఈ సందర్భంగా మంచు లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. అంతేకాకుండా బీచ్ లో వీరి విందుకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే మోహన్ బాబు ప్రస్తుతం “సన్ ఆఫ్ ఇండియా” చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా హిందీలో మంచి ప్రేక్షకాదరణ పొందిన “లవ్ స్టోరీస్ ” చిత్రాన్ని తెలుగులో”పిట్టకథలు”పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సిరీస్ తర్వాత లక్ష్మీ ప్రసన్న నెట్ ఫ్లిక్స్ వేదికగా అభిమానులకు దగ్గర కానున్నారు.అయితే ప్రస్తుతం వీరు మాల్దీవులకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.