Bahubali: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” ఎటువంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2018వ సంవత్సరంలో రిలీజ్ అయిన “బాహుబలి” రెండో భాగం… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని చోట్ల రికార్డులు పగలకొట్టి సరికొత్త రికార్డులు సెట్ చేయడం జరిగింది. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. దర్శకుడు రాజమౌళి పేరు దేశవిదేశాలలో మారుమ్రోగింది. ఇక ప్రభాస్ ఈ సినిమా రాకముందు వరకు తెలుగు లోనే మార్కెట్ ఉండేది బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరగడంతోపాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు.
ఇప్పటికీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “బాహుబలి” రికార్డులు ఎవరు రేప్ చేయలేదు. అటువంటి ఈ సినిమాపై డైరెక్టర్ మణిరత్నం సంచలన కామెంట్ చేశారు. మేటర్ లోకి వెళ్తే మణిరత్నం తాజాగా “పొన్నియన్ సెల్వన్” అనే పాన్ ఇండియా ప్రాజెక్టు సినిమా తెరకెక్కించడం తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. గురించి ఇంటర్వ్యూ లో మణిరత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” సినిమాలు చూసిన తర్వాత… ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని..”పొన్నియన్ సెల్వన్” ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు తెలియజేశారు.
ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరించినట్లు మొదటి భాగం సెప్టెంబర్ 30వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాలని మణిరత్నం డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన పోస్టర్ లు కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. ఈ తరుణంలో సౌత్ ఇండియాలోనే తిరుగులేని డైరెక్టర్ గా… పేరొందిన మణిరత్నం రాజమౌళి తనకు ఆదర్శమని.. చెప్పటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.