Manchu Manoj: హైదరాబాద్ ఫిలింనగర్ లో గత రాత్రి 8:30 గంటలకు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ భూమా మౌనిక వివాహం అతిరధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శని రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు మరియు బంధువులు మధ్య ఒకటయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్, కోదం రామిరెడ్డి, దేవినేని అవినాష్ ఇంకా పలువురు రాజకీయ నేతలు.. నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 2015వ సంవత్సరంలో మనోజ్ కీ ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో వివాహం జరిగింది.
ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో… ఇరువురు పరస్పర అంగీకారంతో 2019లో విడిపోయారు. ఇక 2017 సంవత్సరంలో మౌనిక మరియు గణేష్ రెడ్డికి వివాహమయ్యింది. వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అప్పట్లో మౌనిక రెడ్డి వివాహానికి మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. కట్ చేస్తే ఇప్పుడు మౌనిక రెడ్డికి భర్తగా మారాడు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి పెళ్లికి అప్పట్లో మనోజ్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. దీంతో అప్పట్లో అతిధి ఇప్పుడు భర్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఏడాదికి పైగా మంచు మనోజ్ భూమా మౌనిక కలిసే ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కూడా మీడియా కనిపించడం జరిగింది. ఈ క్రమంలో అప్పటినుండి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో… వీరిద్దరు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అయితే నిన్న ఉదయం పెళ్లికూతురు అంటూ మౌనిక ఫోటోలు మనోజ్ షేర్ చేయడం జరిగింది.