‘ప్రతిరోజూ పండగే’ సక్సెస్తో ఆ చిత్ర బృందం ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు మారుతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భలే భలే మగాడివోయ్ తర్వాత అంత పెద్ద సక్సెస్ అందుకోవడంతో… మారుతీ కూడా విజయానందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇదిలా ఉండగానే.. తన తర్వాతి ప్రాజెక్టులపైనా ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరిని చిత్రసీమకు పరిచయం చేసే పనిలో పడ్డాడట. ఈసినిమాను గతంలోనే ఓకే చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి తర్వాతి షూటింగ్ ప్రారంభం కానుంది. దానయ్య తన సొంత బ్యానర్లోనే తనయుడిని పరిచయం చేస్తున్నాడు. సమ్మర్లో సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారట. మారుతికి ఈ సినిమాతో పాటు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.