Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహూ, రాధేష్యమ్ రెండు అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. ఈ రెండూ కూడా “బాహుబలి 2” విడుదల కాకముందు ఒప్పుకున్న ప్రాజెక్టులు. దీంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సినిమాలు “బాహుబలి 2” విడుదలైన తర్వాత సినిమాలు కావడంతో… అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్ లలో సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే షూటింగులు జరుగుతుంటే ఇంకా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఇంకా మారుతీ దర్శకత్వంలో సినిమాలు స్టార్ట్ కావల్సి ఉంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటువంటి తరుణంలో తాజాగా మారుతి ప్రభాస్ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. జులై 1వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “పక్కా కమర్షియల్” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మారుతీ ఇటీవల ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్..పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ప్రభాస్ కి ఏర్పడింది మరి ఇప్పుడు ఆ స్థాయిలో మారుతి సినిమా చేయగలడా.. అనే కామెంట్స్ బయట ఉన్నాయి.
దీనికి మీ సమాధానం అంటూ ప్రశ్నించగా మారుతీ స్పందిస్తూ…”ప్రభాస్ సినిమా తీయడమనేది ఖరారైపోయింది. నా మార్క్ సినిమాకి ప్రభాస్ యాక్షన్ తోడవుతుంది. ప్రభాస్ కి నేను పెద్ద అభిమానిని .. ఆయన సినిమాలు ఎలా ఉండాలని నేను కోరుకుంటానో అలాగే ఆయనను చూపిస్తాను. ప్రభాస్ అభిమానులు ఆశించే మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది. ఒక ‘బుజ్జిగాడు’ .. ఒక ‘డార్లింగ్’ తరహా కథనే ఆయనకి నేను వినిపించాను. ఆ తరహాలోనే అంతకి మించి అన్నట్టుగా ఈ సినిమా ఉంటుంది” అంటూ మారుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.