Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పంట నష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను.. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఓదారుస్తున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో పవన్ పర్యటించడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలావుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ చెల్లెలు, మెగా బ్రదర్ నాగబాబు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కలిపి 35 లక్షల విరాళం కౌలు రైతులను ఆదుకోవడానికి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ల కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా పవన్ పెట్టిన పోస్ట్ కి ప్రతిస్పందించిన మెగా డాటర్ నిహారిక.. పవన్ కళ్యాణ్ కి థాంక్స్ తెలపడం జరిగింది. ఇటువంటి మంచి పనిలో తమను కూడా భాగస్వామిగా చేసినందుకు థాంక్యూ పవన్ బాబాయ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిపి ఇరవై లక్షలు ఇవ్వగా వైష్ణవి తేజా ఐదు లక్షలు.. నిహారిక ఐదు లక్షల రూపాయలు మొత్తాన్ని “కౌలు రైతు భరోసా యాత్ర” ప్రత్యేక నిధికి విరాళం అందించారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడం..విషయంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి.. కృతజ్ఞతలు బాబాయ్. గొప్ప భవిష్యత్ నిర్మాణం కోసం నిరీక్షణతో విశ్వాసంతో మన ప్రజలకు.. గొప్ప నాయకుడిగా.. మీరు చేస్తున్న పనులలో.. మీరు చూపిస్తున్న కృషి చూస్తుంటే కేవలం నీ వల్లే.. గొప్ప సమాజం రానున్న రోజుల్లో తీర్చిదిద్ద గల సామర్ధ్యం.. ఉందని భావిస్తున్నట్లు నిహారిక.. తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది. నిహారిక పెట్టిన పోస్ట్ కి ఫ్యాన్స్ నుండి భారీఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!