ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సందడే వేరు. ఇండియన్ క్రికెట్ టీమ్ లా మెగా ఫ్యామిలీ హీరోల సంఖ్య ఉంటుందంటారు. వారందరూ ఓ చోట చేరితే మెగా ఫ్యాన్స్ కే కాదు.. ప్రేక్షకులకు కూడా థ్రిల్ వస్తుంది. అంత కనువిందుగా మెగా ఫ్యామిలీ సందడి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా రీసెంట్ గా జరిగిన నాగబాబు తనయ నిహారిక – చైతన్య వివాహం నిలుస్తుంది. పెళ్లికి రాజస్థాన్ జరిగిన సందడి.. దానికంటే ముందు హైదరాబాద్ లో జరిగిన ఫ్యామిలీ సందడి, పార్టీలు నిలుస్తాయి. ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీ ఈతరం హీరోలు, కుటుంబసభ్యులు అందరూ మళ్లీ కలిసి సందడి చేశారు. ఈసారి క్రిస్మస్ పండగ ఇందుకు వేదికగా నిలిచింది.
రామ్ చరణ్ – ఉపాసన క్రిస్మస్ పండగ సందర్భంగా మళ్లీ మరొ మెమరీకి తెర లేపారు. క్రిస్మస్ సంబరాల్లో మెగా హీరోల, కుటుంబసభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు అర్జున్, స్నేహ, సుస్మిత, విష్ణు ప్రసాద్, వరుణ్ తేజ్, నిహారిక – చైతన్య, శ్రీజ – కల్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీ, అల్లు శిరీష్.. ఇతర కజిన్స్ వారి పిల్లలు అందరూ ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగమయ్యారు. క్రిస్మస్ ట్రీ వద్ద వీరందరూ కలిసి సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందరూ చిరునవ్వులు చిందిస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పిక్స్ ను అల్లు శిరీష్ తోపాటు రామ్ చరణ్ కూడా తమ ఇన్ స్టాగ్రామ్ మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
నిన్న రాత్రి జరిగిన క్రిస్మస్ పార్టీ ఇది.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. అని రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ వాల్ లో రాసుకున్నాడు. ఈ పిక్స్ తో మెగాభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్, ఆచార్య, అల్లు అర్జున్.. పుష్ఫ, వరుణ్ తేజ్.. బాక్సర్ ( టినెటివ్ టైటిల్ ), సినిమాల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈరోజు ధియేటర్లలో విడుదలైంది.