Waltair Veerayya: ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో చిరంజీవి మరియు రవితేజ కలిసి నటించిన ఈ సినిమా జనవరి 13వ తారీకు రిలీజ్ కానుంది. నిన్ననే సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి శ్రీకాకుళం యాస భాషలో డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.
ట్రైలర్ చివరిలో… “ఘరానా మొగుడు” సినిమాలో లెఫ్ట్ టర్నింగ్ ఇవ్వండి మాస్టారు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ ఈ సినిమాలో రవితేజ చెప్పటం, ఇక రవితేజ “ఇడియట్” సినిమాలో సిటీకి ఎంతోమంది కమిషనర్ వస్తారు పోతారు.. వీరయ్య లోకల్ అంటూ చిరంజీవి డైలాగ్ చెప్పటం హైలెట్ గా నిలిచింది. ఇదంతా పక్కన పెడితే ప్రీ రిలీజ్ వేడుకకి హీరోయిన్ శృతిహాసన్ డుమ్మా కొట్టడంతో.. అభిమానులు మండిపడుతున్నారు. దీనికి ముందు బాలయ్య నటించిన “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుకకి వెళ్లి చిరంజీవి సినిమాకి రాకపోవటం పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తనకి అనారోగ్యం కారణంగానే… వేడుకకు రాలేకపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండ్ నటుడితో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది.
“వాల్తేరు వీరయ్య” కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈవెంట్ మిస్ అవుతున్నా అని ఇంస్టాగ్రామ్ లో శృతిహాసన్ పోస్టు పెట్టింది. సినిమాకి అతిపెద్ద వేడుకకి హీరోయిన్ రాకపోవడంతో ఫ్యాన్స్ శృతిహాసన్ వ్యవహారంపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వేదిక విషయంలో మొదట ఆర్కే బీచ్ కి పోలీసులు అనుమతులు ఇచ్చిన టీచర్ తర్వాత ఏయూ ల మార్చుకోమని చెప్పటంతో మేకర్స్ అనేక కష్టాలు పడ్డారు. చిరాఖరికి ఏట్టకేలకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నందు “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.