మెగాభిమానులు నిరాశలో ఉన్నారా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాలు తమదైన శైలిలో సత్తాను చాటాయి. అయితే మెగాభిమానులు మాత్రం ఈ అవార్డులను కేటాయించడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మెగాపవర్ స్టార్ రామ్చరణ్ నటించిన `రంగస్థలం` సినిమాపై జ్యూరీ శీతకన్ను వేయడమే అందుకు కారణమట. చెవుడు ఉన్న వ్యక్తిగా రామ్చరణ్ నటన, 1980 బ్యాక్డ్రాప్లో సినిమాను సుకుమార్ తెరకెక్కించిన తీరు, దేవిశ్రీ సంగీతం, ఆర్ట్ వర్క్, కెమెరా పనితనం .. ఇవన్నీ సినిమాకు ప్లస్గా మారినవే. సినిమాను మరో రేంజ్లో నిలబెట్టినవే. `రంగస్థలం` తర్వాత అదే ప్యాట్రన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఓ రకంగా కొత్త ట్రెండ్ మొదలైందనే చెప్పాలి. అయితే ఇవన్నీ జ్యూరీ కనపడలేదా? ఏదో రాజకీయం జరిగింది? అని మెగాభిమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఓ అవార్డుని ఏదో ఇవ్వాలన్నట్లు ఇవ్వడమేంటి? అని వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post