నితిన్తో ‘లై’ చిత్రంలో నటించిన మేఘా ఆకాష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చెన్నై భామ ఆ తర్వాత నితిన్తోనే ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో తెలుగులో మరో సినిమాలో మేఘాను తీసుకోలేదు. ఆ తర్వాత రెండు తమిళ్ సినిమాలు కూడా చేసింది. కానీ, ఆమె కెరీర్కి అవి కూడా ఉపయోగపడలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ తెలుగు సినిమాలో మేఘాను ఓకే చేశారని తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవువుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మనీషా రాజ్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇప్పుడు మేఘాను తీసుకుంటన్నారంటే మనీషాను తప్పించినట్టా? లేక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా మేఘా ఆకాష్ను అదృష్టం వరిస్తుందేమో చూడాలి.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!