నితిన్ లై చిత్రంతో హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించింది మేఘా ఆకాశ్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే కూడా నితిన్తోనే `ఛల్ మోహన్రంగ` చిత్రంలో జత కట్టింది. ఈ సినిమా కూడా ప్లాపయ్యింది. దీంతో మేఘా ఆకాశ్ తమిళంపై దృష్టి పెట్టింది. రజనీకాంత్ `పేట్ట` చిత్రంలో కీలక పాత్ర పోషించిన మేఘా ఇప్పుడు తమిళంలో బిజీగా ఉంది. అయితే మరోమారు తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ఫుల్ హీరోగా రాణించిన రాజ్ తరుణ్ ఇప్పుడు హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. లవర్ తర్వాత మరోసారి దిల్రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆడు మగాడ్రా బుజ్జి దర్శకుడు రామకృష్ణారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మేఘా ఆకాశ్ నటించనుందట. మరి మూడోసారైనా మేఘా ఆకాశ్కి తెలుగులో హిట్ రావాలని కోరుకుందాం..
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!