సినిమాకు కొంచెం పేరు వచ్చి, పబ్లిసిటీ బాగా చేసి, అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో ఏదో ఒక అడ్డంకి రావడం సినిమా ఇండస్ట్రీలో అలవాటే. ఇప్పుడు ఆ ఇబ్బంది `మల్లేశం` సినిమాకు కూడా ఎదురైంది. అయితే ఈ సినిమా విషయంలో ఎదురైన తప్పు కేవలం సినిమాకు సంబంధించింది కాదు, ఆ సినిమాకు మూలకారకుడైన మల్లేశానికి సంబంధించినది. మల్లేశం ఆసుయంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకన్నా ముందు ఆసు యంత్రాన్ని తామే కనుక్కున్నామని ఎలుగొందుల సత్యనారాయణ, ఆయన సోదరుడు ఎలుగొందుల శ్రీనివాస్ చెబుతున్నారట. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వారు ప్రకటించారు. ఇందులో నిజానిజాలు ఎన్నో మల్లేశానికి, వారికీ మాత్రమే తెలియాలి. ఒకవేళ వాళ్లు చెప్పిందే నిజమని తేలితే పద్మశ్రీ అవార్డును మల్లేశం వెనక్కి ఇచ్చేస్తారా? ఆయన కథతో తీసిన సినిమా ఫిక్షనల్గా మారుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
previous post
next post