మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సీటీ మార్ అన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్నాడు. గోపీచంద్ తమన్నా కబడీ కోచ్ లు గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్ ముఖ్యంగా దర్శకుడు సంపత్ నంది..అలాగే హీరో గోపీచంద్ కి చాలా కీలకంగా మారింది. ఇక వరసగా సక్సస్ లు అందుకుంటున్న తమన్నా సెంటిమెంట్ మీద కూడా ఈ ఇద్దరు నమ్మకంగా ఉన్నారు.
అయితే తమన్న ఈ సినిమా చేస్తూనే డిజిటల్ ప్లాట్ ఫాం వైపు అడుగులు వేస్తుందని తాజా సమాచారం. అది కూడా ఒక ప్రముఖ నిర్మాతతో. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొన్ని రోజుల క్రితం ఆహా అనే ఓ డిజిటల్ యాప్ ను ప్రేక్షకులను పరిచయం చేశారు. అంతేకాదు ఆహా ను జనాలలోకి తీసుకు వెళ్ళేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ఇప్పటికే పలువురు దర్శకులు, కంటెంట్ రైటర్లను రంగంలోకి దింపి కథలు..వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే బాగా ఫేం ఉన్న హీరోయిన్స్ ని వెబ్ సిరీస్ లో నటింపచేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే హెబ్బా పటేల్ తో ఆహాలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. అలాగే పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ స్టార్ హీరోయిన్ తమన్నా హోస్ట్ గా టాక్ షో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. తమన్నా కూడా ఇందుకు రెడీ అయిందట. కరోనాతో సినిమాల పరిస్థితి అర్థం కాని నేపథ్యంలో ఇలా వెబ్ సిరీస్, టాక్ షోస్ అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా స్టెప్ వేసి మంచి తెలివికలది తమన్న అనిపించుకుంది.