ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ బాగానే నడుస్తుంది. స్టార్ హీరోయిన్స్ అందరూ హారర్ చిత్రాల్లో నటించిన వారే… నటించడానికి ఆసక్తి చూపుతున్నవారే. ఇప్పుడు ఇలా ఆసక్తి చూపుతున్న హీరోయిన్స్ లిస్ట్లో తమన్నా కూడా చేరనుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే… ఓంకార్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన రాజుగారిగది సినిమాకు పెద్ద క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో పెద్ద నిర్మాణ సంస్థ పి.వి.వి బ్యానర్ సీక్వెల్ను నిర్మించడానికి ముందుకు వచ్చింది. వీళ్లు నాగార్జున, సమంతలతో ఈ హారర్ సీక్వెల్గా `రాజుగారి గది2`ను తెరకెక్కించారు. ఈ సినిమా చాలా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు దీనికి మరో సీక్వెల్ను తెరకెక్కించడానికి దర్శకుడు ఓంకార్ రంగం సిద్ధం చేస్తున్నాడట. అందులో భాగంగా ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నాను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నాడట ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.
previous post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!