హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది.
తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చిరు, నాగ్ తో మంత్రి తలసాని చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం.