కెరీర్ స్టార్టింగ్ లోనే రెండు భారీ ఫ్లాప్స్ ఫేస్ చేసి అభిమానులని నిరాశపరిచిన హీరో… అక్కినేని అఖిల్, మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుంది అనుకుంటున్న టైంలో మిస్టర్ మజ్నుగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో ఈసారి అఖిల్ హిట్ అందుకోవడం ఖాయమని అక్కినేని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకోవాలనే భారాన్ని మోస్తూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన మజ్ను, టాక్ పరంగా పరవాలేదనిపించాడు. రిలీజైన అన్ని సెంటర్ల నుంచీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డబ్బులు మాత్రం రాబట్టలేకపోతోంది. అఖిల్ మూడో సినిమాతో కమర్షియల్ గా భారీ హిట్ అందుకుంటాడు అనుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కేవలం 3కోట్లు మాత్రమే రాబట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు పోటీనే లేని సమయంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అఖిల్ రెండు రోజుల్లో రాబట్టిన మొత్తం షేర్ ఆరు కోట్ల కన్నా తక్కువే.
దాదాపు 25 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన మిస్టర్ మజ్ను సినిమాకి లాభాల మాట అటుంచి సేఫ్ జోన్ లోకి రావాలన్నా, బ్రేక్ ఈవెన్ చేరాలన్నా ఇంకా 19కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత లాంగ్ రన్ వేసుకున్నా కూడా మహా అయితే ఇంకో రెండు-మూడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎటు చూసిన అఖిల్ మూడో సినిమాతో కూడా నిరాశ పరిచినట్లే. మరి నెక్స్ట్ సినిమాతో అయినా అక్కినేని అభిమానుల హిట్ దాహాన్ని అఖిల్ తీరుస్తాడేమో చూడాలి.