Bunny-Dhanush: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. స్టార్ హీరోలు సైతం కలిసి సినిమా చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ మధ్య అలా వచ్చిన చిత్రాలే భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతోందట. వీరిద్దరి డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో తెలుసా.. కొరటాల శివ. అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న కొరటాల చిరంజీవి, రామ్ చరణ్లతో కలిసి `ఆచార్య` అనే మూవీ చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కాబోతోంది.
ఆచార్య అనంతరం కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఆ తర్వాత బన్నీ, ధనుష్లతో ఓ మల్టీస్టారర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఓ అదిరిపోయే లైన్ను సిద్ధం చేసి.. ఆ హీరోలిద్దరికీ వినిపించారట.
అది నచ్చడంతో వారు పాజిటివ్గా స్పందించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే.. త్వరలోనే ఈ నయా ప్రాజెక్ట్పై అధికారిక ప్రటకన వస్తుంది. కాగా, ధనుష్ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంతో తన తొలి తెలుగు చిత్రం చేస్తున్నాడు. `సార్` అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ అనంతరం శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేయనున్నాడు.